మంత్రాలయం,జూలై 14 ప్రభ మనం న్యూస్ ) : అమావాస్య ను పురస్కరించుకుని ఆధ్యాత్మిక క్షేత్రమైన మంత్రాలయం రాఘవేంద్రస్వామి దర్శనార్థం టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యులు పాలకుర్తి తిక్కారెడ్డి మంగళవారం వచ్చారు. వీరికి టీడీపీ మండల కన్వీనర్ పన్నగా వెంకటేష్ స్వామి స్వాగతం పలికారు. వారు ముందుగా గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకొని , పూజలు చేసి మంగళహారతి ఇచ్చారు. అనంతరం రాఘవేంద్రస్వామి మూల బృందావనాన్ని దర్శించుకున్నారు. వారి వెంట టీడీపీ నాయకులు ఎల్లారెడ్డి , మాధవరం అమర్నథ్ రెడ్డి ,, హండే హనుమంతు , వట్టెప్ప నరసింహ , విజయరామిరెడ్డి , చిన్న భీమ , సున్నం రామకృష్ణ , గనెకంటి గురురాజ్ , తదితరులు ఉన్నారు.
శ్రీ మఠంలో పాలకుర్తి తిక్కారెడ్డి మంత్రాలయం
RELATED ARTICLES

