మంత్రాలయం 8,మనం న్యూస్ ;- మంత్రాలయం మండల పరిధిలోని వగరూరు గ్రామానికి చెందిన బోయ ఉరుకుందు మృతి తెలుగు దేశం పార్టి కి తీరని లోటు అని టీడీపీ యువ నాయకులు బెస్త పవన్ కుమార్ అన్నారు. బుధవారం బోయ ఉరుకుందు అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ విషయాన్ని గ్రామ టీడీపీ నాయకులు బెస్త పవన్ కుమార్ మంత్రాలయం టిడిపి నియోజకవర్గంలో ఇంచార్జ్ రాఘవేంద్ర రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఆదేశాలు మేరకు పవన్ కుమార్ మృతున్ని ఇంటికి వెళ్లి బోయ ఉరుకుందు మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మట్టి ఖర్చులకు రూ. 20వేలు సహాయం చేశారు. అన్ని విధాలుగా ఆ కుటుంబానికి ఎల్లప్పుడూ మేము చూసుకుంటామని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు
బోయ ఉరుకుందు మృతి పార్టీ కి తీరని లోటు మంత్రాలయం
RELATED ARTICLES

