AP: ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు మంత్రి నారా లోకేష్. ఉత్తరాంధ్రకు పరిశ్రమలను తీసుకొస్తున్నామన్నారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు అందిస్తామన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి పోలవరం ఎడమ కాలువను అనుసంధానం చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టామని మంత్రి నారా లోకేష్ తెలిపారు.

