దేశాభివృద్ధిపై హర్షం వ్యక్తం చేస్తూ, దేశ ప్రజలకు అభినందనలు తెలిపారు ప్రధాని మోడీ. ప్రపంచ వ్యాప్తంగా యుద్ధాలు, అస్థిర పరిస్థితులు నెలకొన్నప్పటికీ, కోవిడ్ తర్వాత అనేక దేశాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. దేశ ప్రజల సంకల్పం, కృషితోనే ఈ పురోగతి సాధ్యమైందని పేర్కొన్నారు. ఇదే వేగాన్ని కొనసాగిస్తూ దేశ అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు.

